మనం నివసించే భూమితో పాటు ఈ విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి. ఇప్పటికే మనుషులు చంద్రుడిపై అడుగు పెట్టారు. 1969లోనే అది సాధ్యం అయింది. మరోవైపు మార్స్ గ్రహం గురించి కూడా ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాకెట్లను కొన్ని దేశాలు మార్స్ మీదికి పంపించాయి. కానీ.. మనిషి మాత్రం ఇంకా అంగారకుడి మీద అడుగు పెట్టలేదు.
మరి.. అంగారకుడిపై మనిషి ఎప్పుడు తొలి అడుగు పెడతాడు.. అనే ప్రశ్నకు టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్ సమాధానం చెప్పేశారు. 2029 లోపు మనిషి మార్స్ మీద అడుగు పెడతాడట. ట్విట్టర్లో అడిగిన ప్రశ్నకు బదులుగా ఎలోన్ మస్క్ ఈ సమాధానం చెప్పుకొచ్చారు.
2100 సంవత్సరం లోపు మనుషులు మార్స్ను చేరుకోగలరా.. అంటూ చేసిన ట్వీట్కు ఎలోన్ మస్క్ 2029 అనే సమాధానం ఇచ్చారు. 2029 లోపు మనుషులు మార్స్కు చేరుకోవచ్చు అని ఎలోన్ మస్క్ ఒక క్లారిటీ ఇవ్వగానే నెటిజన్లు అస్సలు ఆగలేదు. బిట్కాయిన్స్ పే చేసి మార్స్కు వెళ్లొచ్చా.. నాకు మార్స్లో బాస్కెట్ బాల్ ఆడాలని ఉంది.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
2029
— Elon Musk (@elonmusk) March 16, 2022
ఎలోన్ మస్క్ ఎలాగైనా మార్స్ మీదకు మనుషులను పంపించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ ద్వారా మార్స్కు వెళ్లేందుకు ఎలోన్ మస్క్ టీమ్ రీసెర్చ్ చేస్తోంది. స్టార్షిప్ స్పేస్క్రాఫ్ట్ ద్వారా తొలి కార్గోను మార్స్ మీదికి పంపించేందుకు స్పేస్ఎక్స్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. స్టార్షిప్ స్పేస్క్రాఫ్ట్ను ప్రత్యేకంగా భూకక్ష్యలోకి పంపించి.. ఆ తర్వాత చంద్రుడి మీదికి.. ఆ తర్వాత మార్స్, ఇంకా ఇతర గ్రహాల మీదికి మనుషులను, కార్గోను పంపించేందుకు తయారు చేశారు. ఇప్పటి వరకు తయారు చేసిన అన్ని స్పేస్క్రాఫ్ట్స్ కన్నా.. పవర్ఫుల్ అని దీనికి పేరుంది.
4K video with full duration at https://t.co/OxgImv88hb@elonmusk pic.twitter.com/buf0ipKzhl
— Khoa Le (@rubikvn2100) March 13, 2022
Round it up to 2030 and I'll meet you there. BTW Can I pay in #Bitcoin for the ride there?!
— Ayda (@Crypto_Ayda) March 16, 2022