Lok Sabha Elections | దేశంలో లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల ఓటింగ్ పూర్తైంది. తొలి విడత ఓటింగ్ ఏప్రిల్ 19, రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26న ముగిశాయి. ఇక మూడో విడత ఎన్నికలు మే 7న జరగనున్నాయి. ఇందులో భాగంగా ఓటింగ్పై ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం (election commission) వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తోంది (Voters Awareness Programme).
మూడో విడత పోలింగ్ నేపథ్యంలో కర్ణాటకలోని బెళగావి (Belagavi) ఎన్నికల సంఘం ఎన్నడూ లేనివిధంగా హాట్ ఎయిర్ బెలూన్ (air balloons)ను ఎగురవేసి నగర వాసులకు ఓటింగ్పై అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక మే 7న మూడో విడత పోలింగ్లో భాగంగా దేశ వ్యాప్తంగా మొత్తం 94 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
#WATCH | Karnataka | The election commission holds the ‘Voters Awareness Programme’ in Belagavi using hot air balloons. pic.twitter.com/zrNaKL3EOI
— ANI (@ANI) May 2, 2024
Also Read..
UN | ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై మరోసారి వైఖరి స్పష్టం చేసిన భారత్
Summer Weather | మే నెలలోనూ దంచికొట్టనున్న ఎండలు..! కొనసాగనున్న వడగాలులు.. హెచ్చరించిన ఐఎండీ
Lok Sabha Elections | గోవాలో గెలుపెవరిది?.. రెండు సీట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ