హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా హీట్వేవ్(Heatwave) కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రావణి తెలిపారు. తెలంగాణలో టెంపరేచర్లు పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు. గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హీట్వేవ్ బిల్డప్ అవుతోందని, అన్ని ప్రాంతాల్లోనూ 44 డిగ్రీలు నమోదు అవుతున్నట్లు ఆమె చెప్పారు. మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి టెంపరేచర్లే కొనసాగనున్నట్లు శ్రావణి తెలిపారు. ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
#WATCH | Kachiguda, Telangana: Scientist Dr. A. Sravani, IMD, Hyderabad says, “Telangana temperatures are rising and shooting up to 44 degrees…In the last two or three days of the week, there was a heatwave building up continuously in the entire state…More than 40 degrees of… pic.twitter.com/RU6KUMWxeI
— ANI (@ANI) May 1, 2024