క్విటో: ఈక్వెడార్(Ecuador)లో డ్రగ్ ముఠా బీభత్సం సృష్టించింది. టెలివిజన్ స్టూడియోలోకి ఓ గ్యాంగ్ ఆయుధాలతో ప్రవేశించింది. లైవ్లోనే తమ వద్ద ఉన్న గన్స్తో ఆ గ్యాంగ్ బెదిరించింది. ముసుగులు వేసుకున్న ఆ గ్యాంగ్.. ప్రభుత్వ టీవీ ఛానల్ టీసీ స్టూడియోలోకి ఎంటర్ అయ్యింది. గుయాకుల్ సిటీలో ఈ ఘటన జరిగింది. టీవీ స్టూడియోలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఫ్లోర్పై పడుకోబెట్టారు. అనేక మందిని బంధీ చేశారు. ఓ సాయుధుడు తన వద్ద ఉన్న షాట్గన్ను టీవీ ప్రజెంటర్ తలపై పెట్టి బెదిరించాడు. ఇదంతా టీవీల్లో లైవ్ అయ్యింది. ఆ వ్యక్తినే మరో సాయుధుడు తన వద్ద ఉన్న రివాల్వర్తోనూ బెదిరించాడు. అయితే చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అనేక మంది గ్యాంగ్ సభ్యుల్ని అరెస్టు చేశారు.
Breaking News: Armed gunman have just stormed a TV studio live on air in Ecuador and are taking hostages. This is an evolving situation.
Hooded gunmen have burst onto a live TV set in Ecuador.
Live television images broadcast on Tuesday showed hooded people inside Ecuador’s TC… pic.twitter.com/KPSKoT4zoG
— Jim Ferguson (@JimFergusonUK) January 9, 2024
ఈక్వెడార్లో 60 రోజుల ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇటీవల ఓ కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. చొనేరస్ గ్యాంగ్కు చెందిన గ్యాంగ్స్టర్ తప్పించుకోవడం వల్ల డ్రగ్ ముఠా దాడికి దిగినట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ అడోల్ఫో మాసియస్ విల్లమార్ అలియాస్ ఫిటో అనే వ్యక్తి జైలు నుంచి అదృశ్యం అయ్యాడు. ఈక్వెడార్ పొరుగు దేశం పెరూలో అప్రమత్తత ప్రకటించారు. బోర్డర్ వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు.
ఈక్వెడార్లో జరుగుతున్న దాడుల్ని అమెరికా ఖండించింది. అధ్యక్షుడు డేనియల్ నొబోవాతో టచ్లో ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. ఆ దేశానికి సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు అగ్రదేశం తెలిపింది. అరటిపండు ఎగుమతుల్లో ఈక్వెడార్ టాప్ ప్లేస్లో ఉంటుంది. ఆయిల్, కాఫీ, కొకా, ష్రింప్స్, చేప ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడంలోనూ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే వివిధ డ్రగ్స్ ముఠాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్లే ఈక్వెడార్లో భయానక పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈక్వెడార్లో అంతర్గతంగా సాయుధ సంక్షోభం ఉన్నట్లు అధ్యక్షుడు డేనియల్ నోబోవా ప్రకటించారు.