హైదరాబాద్ : అమెరికాలో వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి చెందింది. ఏపీలోని గుంటూరుకు చెందిన వీ దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్నది. ఈ నెల 12న టెక్సాస్లోని డెంటాన్ సిటీలో తన జిల్లాకే చెందిన స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా, వేగంగా వచ్చిన ఒక వాహనం వారిని ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దీప్తి చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన స్నిగ్ధ ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.