రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ప్రాణపాయస్థితి నుంచి కాపాడడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవియర్స్ కార్యక్రమం 10వ బ్యాచ్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మొత్తం 350 మంది పోలీసులు, రహదారుల వెంట చిరు వ్యాపారాలకు సేవ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఆన్ రోడ్డు కింద ఫస్ట్ రెస్పాండార్స్ను తయారు చేశారు. వీరు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తొలుత రక్తస్రావం అధికం కాకుండా చికిత్స అందించి, తర్వాత దవాఖానకు తరలించే ఏర్పాట్లు చేస్తారు.
ఇలా గోల్డెన్ అవర్లో వైద్యమందించి మరణాలను చాలావరకు తగ్గించనున్నారు. బుధవారం సేవియర్ శిక్షణను పూర్తి చేసుకున్న 10వ బ్యాచ్ ప్రతినిధులు, కూకట్పల్లి ట్రాఫిక్ అధికారులను సీపీ సజ్జనార్ అభినందించారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్స్ వైద్యులు పాల్గొన్నారు.