Greece boat tragedy | యూరోప్ ( Europe)లోని గ్రీస్ (Greece) సమీపంలో ఇటీవల ఘోర పడవ ప్రమాదం (boat tragedy) జరిగిన విషయం తెలిసిందే. సుమారు 750 మంది అక్రమవలసదారులతో వెళ్తున్న బోటు మధ్యధరా సముద్రంలో గత బుధవారం బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 79 మృతదేహాలను వెలికితీశారు.
కాగా, పడవ ప్రమాద ఘటనలో 300 మంది పాకిస్థానీ పౌరులు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. ప్రమాదంలో అధికశాతం మంది బాధితులు తమ జాతీయులే కావడంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సోమవారం జాతీయ సంతాపదినంగా ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనలో 12 మంది మానవ అక్రమ రవాణాదారులను (human traffickers) పాకిస్థాన్ తాజాగా అరెస్ట్ చేసింది.
ఈనెల 14వ తేదీన వలసదారులతో వెళ్తున్న చేపల పడవ (చిన్ననాటి నౌకలాంటిది) మధ్యధరా సముద్రంలో బోల్తాపడిన విషయం తెలిసిందే. పడవ లిబియాలోని టొబ్రుక్ నుంచి ఇటలీకి బయల్దేరిన సమయంలో గ్రీస్ లోని ప్యాలోస్ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Also Read..
Tamil Nadu | రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి.. 70 మందికి గాయాలు
Adipurush | నేపాల్ లో ఆదిపురుష్ పై వివాదం.. భారత్ సినిమాలపై ఖాట్మాండ్లో నిషేధం
Nepal Floods | నేపాల్ లో వరద బీభత్సం.. 5 మంది మృతి.. 28 మంది గల్లంతు