Gita Gopinath | దక్షిణ ఆఫ్రికాలోని శ్వేత జాతి అహంకార పాలనకు వ్యతిరేకంగా నల్ల జాతి ప్రజల పోరాటానికి నెల్సన్ మండేలా (Nelson Mandela) కీలక పాత్ర వహించిన విషయం తెలిసిందే. అయితే జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించిన నెల్సన్ మండేలాను 1963లో శ్వేత జాతి అహంకార పాలకులు అరెస్ట్ చేసి రాబెన్ ద్వీపం (Robben Island)లో ఉన్న జైలుకు పంపించారు. దాదాపు 27 ఏండ్లపాటు జైలు శిక్ష అనుభవించిన నెల్సన్ మండేలా 1994లో దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా మండేలాను అరెస్ట్ చేసి రాబెన్ ద్వీపంలో ఉంచిన జైలుగదిని నేడు భారత సంతతికి చేందిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సందర్శించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు.
”చాలా పవర్ఫుల్, వినయపూర్వకమైన అనుభూతి కలిగింది ఈరోజు. నెల్సన్ మండేలా అరెస్ట్ చేసిన రాబెన్ ఐలాండ్లోని జైలు గదిని సందర్శించాను. స్వేచ్ఛ, న్యాయం అంటే అర్ధంచేసుకోడానికి.. వాటి గురించి తెలుసుకోవడానికి ఇది చాలా మంచి సందర్భం” అంటూ గీతా గోపీనాథ్ ట్విట్టర్లో రాసుకోచ్చింది.
Such a powerful and humbling experience to visit Robben Island and the cell where Nelson Mandela was imprisoned. A profound moment to reflect on the meaning of freedom & justice. pic.twitter.com/Bi12Ve8LWw
— Gita Gopinath (@GitaGopinath) September 3, 2023
ఇక నెల్సన్ మండేలా 1918 జూలై 18 న దక్షిణాఫ్రికాలోని బాసా నది ఒడ్డున ట్రాన్స్కిలోని మెర్వాజో గ్రామంలో జన్మించారు. ప్రజలు అతన్ని మాడిబా అని ఆప్యాయంగా పిలిచేవారు. వర్ణవివక్ష వ్యతిరేక జరిపిన పోరాటంలో మండేలాను రాబెన్ ద్వీపంలో అప్పటి ప్రభుత్వం 27 సంవత్సరాలపాటు జైలులో పెట్టింది. ఆ సమయంలో ఆయనను బొగ్గు గనిలో పని చేయించారు. జైలులోని చాలా చిన్న గదిలో ఉండి చాప మీద పడుకుని జైలు జీవితాన్ని గడిపారు.
జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించిన నెల్సన్ మండేలా.. గాంధీ మహాత్ముడి మాదిరిగానే అహింసా మార్గంలోనే నిరసనలు కొనసాగించాడు. చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 27 ఏండ్ల జైలు జీవితం నుంచి ఆయనకు విముక్తి కల్పించింది. ఈయన పుట్టినరోజును ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2009 జూలై 18 న ‘మండేలా దినం’ గా ప్రకటించింది.
మండేలా సేవలకు గుర్తింపుగా 1990 లో భారతదేశ అత్యునత పురస్కారం భారతరత్న అందించి సత్కరించారు. భారతరత్న అందుకున్న తొలి విదేశీయుడుగా మండేలా చరిత్ర సృష్టించారు. 1993 లో ఆయనకు శాంతి నోబెల్ బహుమతి లభించింది. 95 సంవత్సరాల వయసులో 2013 డిసెంబర్ 5 న అనారోగ్యం కారణంగా నెల్సన్ మండేలా మరణించారు.