రోడ్డుపై వాహనాలు డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర వాహనదారులు ఎలా వస్తున్నారో కూడా గమనిస్తూ ఉండాలి. అదే ఈ రోడ్డుపై వెళ్తుంటే మాత్రం ఎక్కడెక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయో కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ దారిలో నడిరోడ్డుపైనే ఇష్టమొచ్చినట్లు కరెంట్ స్తంభాలు పాతేశారు. అయితే ఇది మనదేశంలో కాదులెండి.
పక్కనే ఉన్న పాకిస్తాన్లో. అక్కడి పంజాబ్ రాష్ట్రంలో ఒక మెయిన్రోడ్డుపై వంకరటింకరగా ఇష్టం వచ్చినట్లు ఎలక్ట్రిక్ స్తంభాలు పాతేశారు. ఈ విషయాన్ని షమా జునేజో అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అది ఒక మెయిన్రోడ్డు అని చెప్పిన షామా.. ఇటీవలే ఒక స్తంభానికి వాహనం ఢీకొన్న ప్రాంతాన్ని కూడా చూపించారు.
చలికాలంలో ఈ ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తుందని, అలాంటి సమయంలో ఈ స్తంభాలు కనీసం కనిపించడం కూడా కష్టంగా మారుతుందని చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. చలికాలంలో ఈ స్తంభాల వల్ల ఎన్ని యాక్సిండెంట్లు జరుగుతాయో? అని ఆశ్చర్యపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం కల్పించుకొని వీటిని సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
یہ کھمبے عثمان بوزدار کے دور میں لگے یا چوہدری پرویز اِلٰہی کے؟ pic.twitter.com/zxR52A3CW0
— Shama Junejo (@ShamaJunejo) October 4, 2022