న్యూఢిల్లీ: చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కాగా, చైనాలో భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్-జిన్జియాంగ్ సరిహద్దుల్లో పలువురు గాయపడ్డారు. ఇండ్లు కూడా కూలిపోయాయని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిన్జియాంగ్ పరిధిలో 27 రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసింది. భూప్రకంపనలు సంభవించిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాయవ్య చైనాలో మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చైనీస్ మీడియా వెల్లడించింది. వాటి తీవ్రత 3.0 నుంచి అంతకంటే ఎక్కువగా నమోదయిందని పేర్కొన్నాయి. అత్యధికంగా 5.3 తీవ్రత రికార్డయిందని తెలిపాయి. భూకంపం కేంద్రం ఉషు కౌంటీకి సమీపంలో ఉన్నదని వెల్లడించాయి. ఇక కజఖిస్థాన్లో కూడా 6.7 తీవ్రతతో భూమి కంపించిందని అత్యవసర శాఖ ప్రకటించింది. దీంతో దేశంలోని అతిపెద్ద నగరమైన అల్మటీలో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారని పేర్కొంది.
Earthquake of Magnitude:7.2, Occurred on 22-01-2024, 23:39:11 IST, Lat: 40.96 & Long: 78.30, Depth: 80 Km ,Location: Southern Xinjiang, China for more information Download the BhooKamp App https://t.co/FYt0ly86HX@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/E184snmSyH
— National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2024