న్యూఢిల్లీ: మయన్మార్లో (Myanmar) భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.56 గంటలకు యాంగాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదయింది. యాంగాన్కు 260 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులుతెలిపారు.
కాగా, శనివారం తెల్లవారుజామున ఇరాన్లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. హోర్మోజ్గాన్ ప్రావిన్స్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఐదుగురు మరణించగా, 44 మంది గాయపడ్డారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారిజామున 3.29 నిమిషాలకు ఈ భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.