పోర్ట్ మోర్స్బే: పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. న్యూగినియాలోని కండ్రియాన్లో (Kandrian) శనివారం రాత్రి 9.24 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించింది. దీని తీవ్రత 6.2గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 38.2 కిలోమీటర్ల లోతులు కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు.
అఫ్గానిస్థాన్లోని (Afghanistan) ఫైజాబాద్లో (Fayzabad) కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.14 గంటలకు ఫైజాబాద్ సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఫైజాబాద్కు 273 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఇక శనివారం ఉత్తర జపాన్ (Japan)లోని హొక్కయిడో (Hokkaido)లో భారీ భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ తెలిపాయి. తీరప్రాంత నగరాలైన కుషిరో, నెమురోలను భూకంపం వణించినా.. ఎలాంటి సునామీ (tsunami) హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.