బీజింగ్: జీపీఎస్ అందుబాటులో లేకున్నా డ్రోన్లు (యుఏవీ) తమ లక్ష్యాల్ని చేధించేలా చైనా పరిశోధకులు సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ‘డిఫెన్స్ వన్’ మ్యాగజైన్లో దీని గురించి కథనం ప్రచురించారు. దీని ప్రకారం కెమెరా డాటాను విశ్లేషించి ఏఐ (కృత్రిమ మేథస్సు) ఆధారిత రోబోలు టార్గెట్ను కచ్చితంగా గుర్తిస్తాయి. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ డ్రోన్లకు జీపీఎస్తో అవసరం లేదని ‘డిఫెన్స్ వన్’ అభిప్రాయపడింది. మిలటరీలో ఈ డ్రోన్లను వాడాలని చైనా భావిస్తున్నది. ఇమేజ్ బేస్డ్ విజువల్ సర్వోయింగ్ (ఐబీవీఎస్) టెక్నాలజీతో పని చేసే ఈ డ్రోన్లు అల్గారిథమ్, సెన్సార్ల సాయంతో కదులుతున్న లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తాయని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.