Drugs Smuggling | నిషేధిత డ్రగ్స్ (Drugs)ను సరిహద్దుల గుండా భారత్ (India)కు తరలించేందుకు డ్రోన్ల (Drones)ను ఉపయోగిస్తున్నట్లు పాకిస్థాన్ (Pakistan) అంగీకరించింది. పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ (Hamid Mir)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రక్షణ సలహాదారు మాలిక్ మహమ్మద్ ఖాన్ (Malik Muhammad Ahmad Khan) కెమెరా ముందు ఈ గుట్టును బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు జర్నలిస్ట్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో సరిహద్దుల గుండా ఎక్కువగా హెరాయిన్ ను అక్రమంగా స్మగ్లింగ్ చేయడానికి డ్రోన్ లను ఉపయోగిస్తున్నట్లు మాలిక్ ఖాన్ అంగీకరించారు.
ఇంటర్వ్యూలో భాగంగా భారత్ కు డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి మాలిక్ ను ప్రశ్నించగా.. ‘ఎల్ఓసీ సమీపంలోని కసూర్ రేంజర్స్ ప్రాంతం. సరిహద్దు నిబంధనల కారణంగా ఈ ప్రాంతం చాలా సున్నితమైంది. దురదృష్టవశాత్తు అక్కడ డ్రోన్ల ద్వారా స్మగ్లింగ్ జరుగుతోంది. ఇటీవలే రెండు డ్రోన్లకు ఒక్కో దానికి 10 కిలోల హెరాయిన్ ను కట్టి విసిరేసిన రెండు ఘటనలు జరిగాయి. ఏజెన్సీలు దానిపై దర్యాప్తు చేస్తున్నాయి’ అని మాలిక్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
IndiGo | విమానంలో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
Prabhas | ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. ఇన్ స్టా ద్వారా వెల్లడించిన డార్లింగ్
Woman Kills Husband | భర్తను గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలుగా చేసి.. కాలువలో పడేసిన భార్య