Drone Strike | హిందూ మహాసముద్రం (Indian Ocean)లో ఓ వాణిజ్య నౌక (Merchant Ship)పై డ్రోన్ దాడి (Drone Strike) జరిగింది. ఈ దాడిలో పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగినట్లు బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే (British maritime security firm Ambrey) శనివారం తెలిపింది.
దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలు ఉన్న ట్యాంకర్ పేలి మంటలు వ్యాపించినట్లు ఆంబ్రే వెల్లడించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వాటిని అదుపు చేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది. నౌకకు మాత్రం నష్టం వాటిల్లినట్లు తెలిపింది. లైబీరియా జెండాతో ఉన్న రసాయన ఉత్పత్తుల ట్యాంకర్ ఇజ్రాయెల్ అనుబంధ నౌక అని ఆంబే తెలిపింది. ఈ నౌక సౌదీ అరేబియా నుంచి మంగళూరు వస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలోని వెరావల్కు నైరుతి దిశలో 200 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించింది.
కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి వచ్చే నౌకల్ని, ఇజ్రాయెల్ అనుబంధంగా పనిచేస్తున్న నౌకల్ని యెమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఇరాన్ వ్యవహరిస్తోందని అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి.
Also Read..
Lift Crashes | 8వ అంతస్తు నుంచి పడిపోయిన లిఫ్ట్.. తొమ్మిది మంది ఐటీ ఉద్యోగులకు గాయాలు
RBI | బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఆర్బీఐ ఫైర్.. రూ.5 కోట్ల జరిమానా
Mamata Banerjee | లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేయండి.. దీదీకి బీజేపీ సవాల్