మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 12: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో పట్టణంలోని ప్రధాన రోడ్లతోపాటు వీధులన్నీ బోసిపోయాయి. పోలీసులు ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం వెసులు బాటు కల్పించిన అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తు న్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్నవారిని హెచ్చరిస్తూ లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.
కిటకిటలాడిన మార్కెట్లు..
లాక్డౌన్తో పది రోజులపాటు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరుచుకోనున్నాయి. దీంతో అవస రమై సామగ్రి, కూరగాయల కోసం జనాలు మార్కెట్లకు పొటె త్తారు. మార్కెట్, జేఎన్రోడ్డు ప్రాంతం జనాలు, వాహనాల తో కిక్కిరిసిపోవడంతో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సి లర్లు శ్రీనివాస్, కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత తదితరులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
ప్రజలు సహకరించాలి : మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెల 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ చేయాలన్న ప్రభుత్వం నిర్ణయానికి ప్రజ లు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కోరారు.
నిర్మానుష్యంగా రోడ్లు, కాలనీలు
తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటల్లోపు ప్రజలు నిత్యావసర సరుకులను తీసుకెళ్లారు. పది గంటల తర్వాత ఇండ్లకే పరిమితం కావడంతో జన సంచారం లేక పట్టణ ప్రధాన రహదారితోపాటు కాలనీలు నిర్మానుష్యంగా మారాయి. ఎస్సైలు సత్యనారాయణ, యాదవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గస్తీ చేపట్టారు. అల్లాపూర్ టోల్ప్లాజా వెలవెలబోయింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పట్టణ ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దుకాణాల వద్ద కావాల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి ఇండ్లకు వెళ్లపోయారు. ఈ సందర్భంగా సీఐ నాగార్జునగౌడ్, ఎస్సై రాజేశ్ తమ సిబ్బందితో రామాయంపేటలో గస్తీ చేపట్టి, 10 గంటల తర్వాత తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాందేడ్ – అకోలా రోడ్డుపై చెక్పోస్ట్
పెద్దశంకరంపేట మీదుగా వెళ్లే నాందేడ్ -అకోలా జాతీయ రహదారిపై పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాలతో పాటు ప్రజలు తిరగక పోవడంతో జాతీయ రహదారి వెలవెలబోయింది. లాక్డౌన్కు పట్టణప్రజలు సహకరించాలని ఎస్సై నరేందర్ కోరారు.
అనవసరంగా తిరిగితే చర్యలు ..
ఇండ్లకే పరిమితమై ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఎస్సై సత్యనారాయణ కోరారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా మాస్క్ను ధరించాలని సూచించారు.
ఈ- పాస్ ఉంటేనే అనుమతి
రద్దీగా ఉండే హవేళిఘనపూర్ చౌరస్తా నిర్మాన్యుంగా మారింది. ఎస్సై శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో ప్రజలు బయటకు రాకుండా అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే ఈపాస్ అనుమతి పొందిన తర్వాతనే వెళ్లాలని, అనవసరంగా బయటకు వస్తే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఎస్సై శేఖర్రెడ్డి హెచ్చరించారు.
నర్సాపూర్లో కట్టుదిట్టంగా..
కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు నర్సాపూర్లో వ్యాపారస్తులు పూర్తిగా సహకరిస్తున్నారు. దుకాణాలు మూసి వేయడంతో రోడ్డుపై వాహనదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి.
అడిషనల్ కలెక్టర్ పర్యవేక్షణ..
నర్సాపూర్ పట్టణంలో లాక్డౌన్ పరిస్థితులపై అడిషనల్ కలెక్టర్ రమేశ్ ఆరా తీశారు. నర్సాపూర్లో లాక్డౌన్ను పరిశీలించి ఎస్సై గంగరాజుతో వివరాలను అడిగి తెలుసుకు న్నారు. లాక్డౌన్ కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.
పాపన్నపేటలో సంపూర్ణం
మండలంలో లాక్డౌన్ ప్రశాంతం గా కొనసాగుతున్నది. ఉదయం 10గంటల వరకు ప్రభుత్వం లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో ప్రజలు తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. అన్ని గ్రామాలు లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు గ్రామాల్లో గస్తీ నిర్వ హిస్తూ లాక్డౌన్ సంపూర్ణమయ్యేలా చొరవ తీసుకున్నారు.
ఇండ్లకే పరిమితం కావాలి
మండలంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ వర్తక, వ్యాపార సంస్థలు ఉదయం 6 గంటల నుంచి 10 వరకు తెరిచి ఉంచారు. స్థానిక ఎస్సై ప్రకాశ్గౌడ్, సిబ్బంది మండల వ్యాప్తంగా గస్తీ చేపట్టారు. అత్యవసరమైతే తప్పా, మిగతా సమయాల్లో ఇంటికే పరిమితం కావాలని కోరారు.
గడువులోగా షాపులను మూసివేయాలి
మండలంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు వ్యాపార సంస్థలు తెరిచి, అనంతరం మూసివేశారు. చిన్నశంకరంపేట ఎస్సై మహ్మద్గౌస్ గ్రామాల్లో తిరుగుతూ వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు.
దుకాణాలను మూసివేయించిన ఎస్సై
లాక్డౌన్ మొదటిరోజు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో ప్రశాంతంగా ముగిసింది. వెల్దుర్తిలో 10 గంటల తర్వాత దుకాణాలు మూసివేయకపోవడంతో ఎస్సై మహేందర్ వాటిని మూసివేయించారు. లాక్డౌన్తో వెల్దుర్తి పట్టణంతోపాటు గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.