మెల్బోర్న్: పపువా న్యూ గినియాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న కొండచరియలు విరిగిపడ్డ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. రాజధాని పోర్ట్మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 100 మంది మరణించి ఉంటారని తొలుత అంచనా వేశారు.
అయితే మృతుల సంఖ్య 670కి పైగా ఉంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ చీఫ్ శేర్హన్ అక్టోప్రాక్ ఆదివారం తెలిపారు.