ఇస్లామాబాద్: రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్లో గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. అయితే పోలింగ్కు ముందు రోజు పేలుడు సంఘటనలు జరిగాయి. (Blasts in Pakistan) పాకిస్థాన్ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాల సమీపంలో జరిగిన పేలుళ్లలో 22 మంది మరణించారు. నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్లో బుధవారం ఈ సంఘటన జరిగింది. పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం వద్ద మొదటి పేలుడు జరిగింది. ఈ సంఘటనలో 12 మంది మృరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖిల్లా సైఫుల్లా పట్టణంలో రెండవ దాడి జరిగింది. జమియాత్ ఉలేమా ఇస్లాం (జేయూఐ) కార్యాలయం సమీపంలో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల వెనుక ఎవరున్నారన్నది స్పష్టం కాలేదు. అయితే ఉగ్రవాదులు, బబూచిస్థాన్ వేర్పాటు వాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్లో గురువారం జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పేలుళ్ల నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.