Nobel Prize | ఆర్థికశాస్త్రంలో ( Economic Sciences) ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి (Nobel Prize) వరించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డారన్ ఏస్మోగ్లు, సిమన్ జాన్సన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన జేమ్స్.ఎ.రోబిన్సన్లకు ఈ యేటి ఎకనామిక్స్ నోబెల్ దక్కింది. సమాజ శ్రేయస్సును నిర్ణయించడంలో సంస్థల పాత్రపై వీరు చేసిన అధ్యయనానికి గానూ నోబెల్ బహుమతి దక్కింది.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Daron Acemoglu, Simon Johnson and James A. Robinson “for studies of how institutions are formed and affect prosperity.”… pic.twitter.com/tuwIIgk393— The Nobel Prize (@NobelPrize) October 14, 2024
గతేడాది కూడా ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. బెన్ ఎస్ బెర్నాంకి, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్.దిబ్విగ్లు నోబెల్ను అందుకున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై ఈ ముగ్గురు పరిశోధనలు చేశారు. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైందన్న విషయాన్ని ఈ ముగ్గురూ తమ పరిశోధనల్లో వెల్లడించారు. బ్యాంకులు దివాళా తీయకుండా ఉండేందుకు ఈ స్టడీ చాలా కీలకమైందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.
కాగా, స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నెబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన జ్ఞపకార్థం ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో, సాహిత్యంలో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది.
Also Read..
Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. 21 నుంచి పరీక్షలు
YS Jagan | మీ బెంగళూరులో ఏమోగానీ.. మా ఏపీలో ఉచితంగానే ఇసుక లభిస్తుంది.. జగన్పై టీడీపీ సెటైర్లు
Harish Rao | స్పెషల్ బస్సుల పేరుతో విపరీతంగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు.. మండిపడ్డ హరీశ్రావు