బీజింగ్: ఆర్నేళ్ల తర్వాత తొలిసారి చైనాలో మళ్లీ కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయి. దేశ రాజధాని బీజింగ్లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శనివారం నుంచి బీజింగ్లో కోవిడ్ వల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్నది. చైనాలో ప్రస్తుతం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ మరణాలు నమోదు కావడం ఆందోళకరంగా మారింది.
జీరో కోవిడ్ పాలసీని వ్యతిరేకిస్తూ చైనాలో నిరసనలు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా లక్షల సంఖ్యలో జనం లాక్డౌన్లో ఉన్నారు. కొందరు పౌరుల్ని బలవంతంగా క్వారెంటైన్ చేశారు. బీజింగ్లోని హైదియన్ ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ షాపులు, స్కూళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. 30 లక్షల మందిని ఇండ్లలోనే ఉండాలని ఆదేశించారు.
సిటీలోకి వెళ్లేవాళ్లకు వరుసగా మూడు రోజులు పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత ఆదేశాల మేరకు బయటకు రావాల్సి ఉంటుంది. బీజింగ్లో 2.1 కోట్ల జనాభా ఉన్న విషయం తెలిసిందే.