బ్యాంకాక్, మే 13: పొదుపు పేరిట పోంజి స్కీమ్తో ఆన్లైన్లో మోసానికి పాల్పడిన దంపతులకు థాయిలాండ్ క్రిమినల్ కోర్టు ఒక్కొక్కరికి 12,640 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. వాంటనీ తిప్పావెత్, ఆమె భర్త మేతి చిన్ఫా పాంజీ 2019లో పోంజి మోసానికి తెరతీసారు. తమ వద్ద డ బ్బు పొదుపు చేస్తే వాటిపై 96% రిటర్న్స్ ఇ స్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంజి పథకంలో చేరాలంటూ ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఊ దరగొట్టారు.
ఆన్లైన్లో ఉంచి ప్రలోభపెట్టేవారు. ఇలా వచ్చిన సొమ్ముతోనే తాను ఒక జ్యూయలరీ షాపును కూడా కొనుగోలు చేసానంటూ రకరకాల నగలు ధరిస్తూ వీడియోలో చూపిస్తూ రెచ్చగొట్టేది. వాస్తవానికి తన ఆఫీస్లోని రూమ్నే నగల షాపుగా భ్రమింపజేసేలా వారు నకిలీ వీడియోను తయారు చేశారు. దీంతో 2500 మందికి పైగా వారి పథకంలో పెట్టుబడి పెట్టారు. సుమారు 51.3 మిలియన్ డాలర్లు సేకరించి ఇద్దరూ బిచాణా ఎత్తేసారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు.