ఢాకా: బంగ్లాదేశ్లో మళ్లీ పూర్తి స్థాయిలో ఏడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలులోకి రానున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉదృతం అవుతున్న నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో రోడ్డు రవాణాశాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యాక్టరీలను తెరిచి ఉంచనున్నారు. కార్మికులు షిఫ్ట్ పద్దతుల్లో పనిచేసుకునే వీలు కల్పించారు. బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఏడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు పది వేల మంది వైరస్ వల్ల మరణించారు.