లండన్, డిసెంబర్ 2: నేటి యుగంలో జనాభా పెరుగుతున్నకొద్దీ వాయు కాలుష్యం కూడా భారీగా పెరిగిపోతున్నది. మెట్రో నగరాలతోపాటు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు అధిక కాలుష్య ప్రాంతాల్లో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇది వారిలో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. ఇంగ్లండ్లోని 3.6 లక్షల మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. గాలి కాలుష్యానికి ఎక్కువగా గురవుతున్నవారిలో నాడీ సంబంధ, శ్వాసకోశ, గుండె సంబంధ వ్యాధులతోపాటు మానసిక సమస్యలైన డిప్రెషన్, మనో వ్యాకులత కనిపిస్తున్నట్టు గుర్తించారు.