బీజింగ్: హిందూ మహాసముద్రం లో చైనాకు చెందిన మత్స్యకార నౌక బోల్తా పడింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 39 మంది గల్లంతయ్యారు. వీరి ఇంకా ఆచూకీ దొరకలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. బాధితుల జాడ కోసం సాయం చేయాలని పొరుగుదేశాలను చైనా అభ్యర్థించింది. ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవులు, ఫిలిప్పీన్స్, ఇతర దేశాలకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.