Lock Down in China | చైనాలో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఆ దేశ ఫైనాన్సియల్ హబ్గా పేరొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. కోవిడ్-19 సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో సోమవారం నుంచి దశల వారీగా లాక్డౌన్ అమలు చేయాలని చైనా సర్కార్ నిర్ణయించింది. షాంఘై నగరంలో 2.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
ప్రాథమిక దశలోనే కరోనాను కట్టడి చేయడానికి షాంఘై నగరాన్ని అధికారులు రెండు భాగాలుగా విభజించారు. నగర ప్రజలకు మూకుమ్మడి పరీక్షలు నిర్వహించనున్నట్లు షాంఘై అధికారులు ఆదివారం చెప్పారు. శనివారం వరకు లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.