తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించారు. తలస్సేరి నియోజకర్గం నుంచి పోటీ చేయాలని భావించిన బీజేపీ అభ్యర్థి, పార్టీ కన్నూరు అధ్యక్షుడు హరిదాస్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అభ్యర్థి ఇచ్చిన ఫామ్పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం లేదంటూ ఆయన నామినేషన్ను తిరస్కరించారు. ఇదే కారణంతో గురువాయూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నివేదితా సుబ్రమణియమ్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురవడం గమనార్హం. ఇక ఇడుక్కిలోని దేవికులం నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే అభ్యర్థి ధనలక్ష్మి నామినేషన్ను తిరస్కరించారు. ఫామ్ను పూర్తిగా నింపలేదన్న కారణంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఏఐఏడీఎంకేకు బీజేపీ మద్దతు ఇస్తోంది. అయితే తమ నామినేషన్లను తిరస్కరించడంపై ఇద్దరు బీజేపీ అభ్యర్థులు హైకోర్టుకెళ్లారు. దీనిపై ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.