బీజింగ్: కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి విళయతాండవం చేస్తున్నది. కేవలం 30 రోజుల్లోనే 60 వేల మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో అమలులో ఉన్న జీరో కోవిడ్ పాలసీని డ్రాగన్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 8న ఎత్తివేసింది. దీంతో చైనాలో భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకు కరోనా లక్షణాలతో 59,938 మంది మరణించారని నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) వెల్లడించింది.
ఇందులో 5,503 మంది శ్వాస సంబంధిత సమస్యలతో మృతిచెందగా, 54,435 మంది ఇతర కారణాలతో చనిపోయారని తెలిపింది. మృతుల సగటు వయస్సు 80 ఏండ్లుగా ఉందని, మరణించినవారిలో 90 శాతం మంది 65 ఏండ్లకు పైబడినవారేనని పేర్కొన్నది.
Nearly 60,000 people with COVID-19 have died in hospitals since China abruptly dismantled its zero-COVID policy in December, a steep increase from previously reported figures https://t.co/Ptumqa76Va pic.twitter.com/8gKfzDtqaR
— Reuters (@Reuters) January 14, 2023
కాగా, కరోనాతో అత్యవసర పరిస్థితిలో హాస్పిటళ్లలో చేరుతున్న వారిసంఖ్య భారీగా ఉంటున్నదని, అయితే ఇది క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెల్లడించారు. గతేడాది డిసెంబర్ నాటికే 76 శాతం మంది బైరస్ బారిన పడినట్లు తెలుస్తున్నది. ఈ నెలాఖరుకు వైరస్ బాధితులు 92 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
ఇక జనవరి 22 నుంచి చైనాలో ప్రారంభమయ్యే న్యూ ఇయర్, స్ప్రింగ్ ఫెస్టివల్ సందర్భంగా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు జెంగ్ గ్వాంగ్ హెచ్చరించారు. వచ్చే 2, 3 నెలల్లో కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుంనది చెప్పారు.
Wow, this is quite a jump! #CCP says today that 59,938 people died of # COVID-related diseases in all hospitals in #China from Dec 8 to Jan 12. But only 5503 died directly from #COVID. All others had underlying issues. Average age of the dead is 80.3 years old.
Do u believe it? pic.twitter.com/uKBhagC9N2— Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 14, 2023
జనవరి 11 నాటికి చైనా వ్యాప్తంగా 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. 141 కోట్ల డ్రాగన్ దేశ జనాభాలో ఇది సుమారు 64 శాతం. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్ లో 91 శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్రావిన్స్ తర్వాత యూనాన్ ప్రాంతంలో 84 శాతం, కింఘైలో 80 శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్లు పేర్కొంది.