బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చైనా ప్రధాన భూభాగంలో కరోనా బాధితుల సంఖ్య 3,72,964కు చేరింది.
కరోనా కేసులు పెరగడంతో బీజింగ్, షాంఘై, గువాంగ్జౌ, చాంగక్వింగ్ వంటి ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసింది. అయితే కరోనా బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతుండంతో ఆంక్షలను సడటలించాని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే కరోనా నిబంధనలను సడలించనున్నట్లు వీడియా వర్గాలు పేర్కొన్నాయి.