బీజింగ్ : పాఠశాల వ్యవస్థలో (China Education) మార్పులను తీసుకువచ్చేందుకు చైనా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. సమగ్ర విద్యా సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ సంస్కరణల ప్రకారం పిల్లలు ఏడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వారికి పరీక్షలు నిర్వహించకూడదు. దీని ప్రధాన ఉద్దేశం పిల్లల విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి తగ్గించడమే అని అక్కడి విద్యావేత్తలు చెప్తున్నారు. అలాగే, మరింత మంది పిల్లలను కనేందుకు తల్లిదండ్రులకు సమయం కలిసి వస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు
సోమవారం కొత్త మార్గదర్శకాలను చైనా ప్రభుత్వం జారీ చేసింది. అదేవిధంగా, ఈ ఏడాది నుంచి మొదటి, రెండో తరగతి విద్యార్థులకు వ్రాతపూర్వక హోంవర్క్ను కూడా ప్రభుత్వం నిషేధించింది.
తరచుగా చిన్నారులకు పరీక్షలు నిర్వహించడం వల్ల.. విద్యార్థులపై చాలా భారం పడుతున్నదని విద్యా సంస్కరణల్లో నిపుణులు సూచించారు. దాంతో ఏడేండ్ల వయసు వరకు చిన్నారులకు పరీక్షలను చైనా విద్యా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. చిన్న వయసు నుంచే విద్యార్థులపై ఒత్తిడి.. వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కాకుండా, జూనియర్ ఉన్నత పాఠశాల వరకు పరీక్షలను కూడా పరిమితం చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
విద్యా అసమానతలను తగ్గించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ట్యూషన్ కేంద్రాలను ప్రభుత్వం జూలై నెలాఖరులో నిషేధించింది. మధ్యతరగతి తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రైవేట్ ట్యూషన్ కేంద్రాల్లో చేర్చించి చదువు చెప్పించేందుకు ఏటా దాదాపు రూ.11.27 లక్షలు ఖర్చవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్ చేపట్టాలని అధికారులు గత వారం ప్రకటించారు.
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
ఇవి తినే 109 ఏండ్లు బతికా : జాన్ టిన్నిస్వుడ్
నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..