హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ఆదివారంతో రూ.10వేల కోట్ల మార్ను చేరుకున్నదని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. 2023 డిసెంబర్ 9న పథకం ప్రారంభమైన నాటి నుంచి 28 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 290 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేరుకున్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు.
ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నట్టు ఎండీ వెల్లడించారు. అనతి కాలంలోనే రూ.10 వేల కోట్లను మహిళలు ఆదా చేసుకోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఇది ప్రయాణం మాత్రమే కాదని, ఆడబిడ్డల గెలుపని పేర్కొన్నారు.