సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ట్రై కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. రేపటితో ఓటీఎస్ గడువుతో పాటు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దరిమిలా రెండు రోజుల పాటు మొండి బకాయిదారులపై మరింతగా దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ తొలుత రూ.3వేల కోట్లను టార్గెట్గా పెట్టుకున్న అధికారులు ఆ తర్వాత టార్గెట్ను రూ. 2500కోట్లకు తగ్గించారు. ఈ నేపథ్యంలోనే ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు రూ.2333 కోట్ల మేర ట్యాక్స్ వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.