వాషింగ్టన్, ఫిబ్రవరి 8 : భారత్తో గల్వాన్ ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే చైనా రహస్యంగా అణు పరీక్షలు జరిపినట్టు అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి థామస్ డినానో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చైనా అత్యంత రహస్యంగా అణు పరీక్షలను జరిపింది.
దీని ప్రభావం బయటి ప్రపంచానికి తెలియకుండా ‘డీకప్లింగ్’ అనే పద్ధతిని కూడా ఉపయోగించింది. ఇలాంటిదే ఒక అణు పరీక్ష 2020 జూన్ 22న నిర్వహించింది’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను చైనా ఇప్పటివరకు ఖండించలేదు. గల్వాన్ ఘర్షణలో ఎంతమంది సైనికులు చనిపోయారన్నది చైనా అధికారికంగా తెలుపలేదు. నిఘా వర్గాల నివేదిక ప్రకారం, సుమారుగా 40 మంది చనిపోయారు.