హౌస్టన్, జూలై 7: ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సలో ఆరోగ్యకర కణాలు కూడా చనిపోతుంటాయి. దానివల్ల మనుషులు మరింత బలహీనంగా మారుతున్నారు. అయితే, క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే అత్యాధునిక పద్ధతిని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
హౌస్టన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూక్లియర్ రిసెప్టార్స్ అండ్ సెల్ సిగ్నలింగ్ పరిశోధకులు ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ చికిత్స వల్ల సాధారణ కణాలు ప్రభావితం కావని, ఫలితంగా రోగి బలహీనపడే పరిస్థితులు తగ్గుతాయని వెల్లడించారు.