వాషింగ్టన్, ఏప్రిల్ 2: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మంత్రివర్గ తొలి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. తన క్యాబినెట్లోని వైవిధ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ‘మంత్రివర్గం అమెరికాను ప్రతిబింబిస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ క్యాబినెట్లో అత్యధికంగా శ్వేతజాతీయులు, పురుషులే ఉండగా.. బైడెన్ మాత్రం భిన్నవర్గాలకు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తొలిసారిగా ఓ నల్లజాతీయుడిని, ఓ స్వలింగ సంపర్కుడికి మంత్రివర్గంలో చోటుకల్పించారు. ఆర్థికమంత్రిగా తొలిసారి ఓ మహిళను నియమించారు.
ఇవి కూడా చదవండి..
పట్టాలు తప్పిన రైలు 48మంది మృతి
‘గ్లోబల్ టీచర్’ మరియమ్మ కన్నుమూత