లండన్, ఏప్రిల్ 2: గ్లోబల్ టీచర్ అవార్డుకు స్ఫూర్తి ప్రదాత మరియమ్మ వార్కే శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 89 ఏండ్లు. కేరళకు చెందిన మరియమ్మ, ఆమె భర్త కేఎస్ వార్కే1959లో దుబాయ్కు వలసవెళ్లారు. అక్కడ మరియమ్మ అరబ్ పిల్లలకు ఇంగ్లిష్ బోధించేవారు. ఆమె శిష్యుల్లో రాజకుంటుంబం పిల్లలు కూడా ఉన్నారు. యూఏఈలో ఇంగ్లిష్ విద్యకు డిమాండ్ పెరగడంతో 1968లో ప్రత్యేకంగా జెమ్స్ ఎడ్యుకేషన్ పేరుతో బడిని ప్రారంభించారు. తద్వారా దుబాయ్ విద్యావ్యవస్థలో గొప్ప మార్పునకు మరియమ్మ కారణమయ్యారు. మరియమ్మ తన జీవితమంతా ఉపాధ్యాయురాలిగా విద్యార్థులను తీర్చిదిద్దడంలోనే గడిపారు. ఆమె స్ఫూర్తితో కుమారుడు సన్నీ వార్కే 2015లో గ్లోబల్ టీచర్ అవార్డును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
పట్టాలు తప్పిన రైలు 48మంది మృతి
అమెరికాను ప్రతిబింబిస్తున్న క్యాబినెట్: బైడెన్