న్యూఢిల్లీ : పాక్కు చెందిన మూడు సంవత్సరాల బాలుడు అంతర్జాతీయ సరిహద్దు (IB) సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించాడు. ఆ బాలుడిని భద్రతా బలగాలు చేరదీసి.. ఆ దేశ సైన్యానికి అప్పగించినట్లు ఆర్మీ వర్గాలు శనివారం తెలిపాయి. శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఫిరోజ్పూర్ సెక్టార్కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన సైనికులు మూడు సంవత్సరాల వయసున్న ఓ బాలుడు పాక్ నుంచి సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి రాగా పట్టుకున్నారు.
అయితే, బాలుడి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. బాలుడు ఏమీ చెప్పలేకపోయాడు. అతన్ని ఆర్మీ సంరక్షణలో ఉంచుకొని.. ఆ తర్వాత బీఎస్ఎఫ్ పాక్ రేంజర్లను సంప్రదించి.. రాత్రి 9.45 గంటల సమయంలో ఆ బాలుడిని మానవతా దృక్పథంతో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా సరిహద్దు దాటే వారితో బీఎస్ఎఫ్ ఎల్లప్పుడూ మానవీయణ కోణంలో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.