కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కాబూల్లోని గురుద్వారా వద్ద ఆ పేలుళ్లు జరిగాయి. అదే ప్రాంతంలో కాల్పులు శబ్ధాలు కూడా వినిపించాయి. ఆ సమయంలో గురుద్వారాలో చాలా మంది భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కర్తే పర్వాన్ ప్రాంతంలో ఉన్న గురుద్వారా రోడ్డుపై పేలుళ్లు జరిగాయి. జనం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో అనేక మంది చనిపోయి ఉంటారని స్థానిక మీడియా పేర్కొన్నది. గురుద్వారా దశ్మేశ్ పితా సాహిబ్ జీకి ఉన్న రెండు గేట్ల వద్ద పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ ఇద్దర్ని హాస్పిటల్కు తరలించామని, గురుద్వారా వద్ద గార్డును కాల్చినట్లు ఓ నేత తెలిపారు.
గురుద్వారాలో ఉదయం ప్రార్థనలో సుమారు 30 మంది పాల్గొన్నారు. ఆ సమయంలో దుండగులు గురుద్వారా ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. లోపల ఉన్న సుమారు 15 మంది పరారీ అయ్యారు. మిగితా వారంతా లోపల చిక్కుకుని ఉంటారని లేదా మరణించి ఉంటారని భావిస్తున్నారు. సెక్యూర్టీ గార్డ్ అహ్మద్ను కాల్చి చంపారు.