Beijing | డోక్సూరి తుపాను (Typhoon Doksuri) కారణంగా చైనా (China) అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) వరదలు (Floods) పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ (Beijing) వరదలకు అతలాకుతలమైంది. పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వరదల కారణంగా సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పలువురు వరదల్లో గల్లంతైనట్లు తెలిపింది.
బీజింగ్ లో ఎడతెరిపి లేని భారీ వర్షం కారణంగా వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కార్లు, ఇతర వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 5 లక్షల మందికిపైగా ప్రజలు ఈ వరదలకు ప్రభావితులయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాగా, బీజింగ్ లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం 140 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని బీజింగ్ వాతావరణ శాఖ (Beijing Meteorological Bureau) తెలిపింది. శనివారం నుంచి బుధవారం మధ్య బీజింగ్ లో 744.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. 1891లో రికార్డు స్థాయిలో 609 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. ఆ రికార్డు ఇప్పుడు బద్దలైందని వెల్లడించింది.
Also Read..
Seema Haider | సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీమా హైదర్..? మర్డర్ స్టోరీకి ఆడిషన్స్ ఇచ్చిన పాక్ మహిళ
Rahul Gandhi | మోదీ ఇంటిపేరు కేసు.. క్షమాపణలు చెప్పేదే లేదన్న రాహుల్