China | కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న చైనాలో సంక్షోభం ముదిరినట్లు తెలుస్తున్నది. అధ్యక్షుడు జీ జిన్పింగ్ను హౌస్ అరెస్ట్ చేశారని వార్తలొచ్చాయి. రెండు రోజుల క్రితం దేశంలోని వివిధ విమానాశ్రయాల పరిధిలో 60 శాతం విమానాలు నేలకు పరిమితం అయ్యాయని సోషల్ మీడియా కోడై కూస్తున్నది. కానీ, దీనిపై చైనా సర్కార్ ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. జీ జిన్ పింగ్ స్థానే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చీఫ్ లీ కియామింగ్.. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారన్న వార్తలొచ్చాయి.
6000కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాల సర్వీసులను రద్దు చేశారని సమాచారం. చివరకు హైస్పీడ్ రైలు కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేశారని చెబుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు హైస్పీడ్ రైళ్లు, హైస్పీడ్ ట్రైన్లు, బస్సులు కూడా నిలిపివేశారు. హైస్పీడ్ రైలు టికెట్లన్నీ అమ్ముడు పోవడం గమనార్హం.
జీ జిన్పింగ్పై కుట్రకు ఈ నెల 14న అంకురార్పణ జరిగినట్లు తెలుస్తున్నది. సమర్ఖండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లగానే.. జిన్పింగ్ను సాగనంపేందుకు సన్నాహాలు ప్రారంభమైనట్లు సమాచారం. దీన్ని ఏ అంతర్జాతీయ వార్తా సంస్థ కూడా ధృవీకరించడం లేదు. చైనా విదేశాంగశాఖ సైతం మౌన ముద్ర వహిస్తున్నది. గతంలో మాదిరిగా చైనా అధికార మీడియా కూడా స్పందించడం లేదు.
Xi is most likely in quarantine after coming back from SCO. There is no coup. Looks like a lot of alt-media in India picked up the rumour.
— Aadil Brar (@aadilbrar) September 24, 2022
వచ్చే నెల 16 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ సదస్సు జరుగనున్నది. ఈ సమావేశాల్లో అసాధారణ రీతిలో మరో ఐదేండ్లు దేశ అధ్యక్షుడిగా జీ జిన్పింగ్ కొనసాగేందుకు తీర్మానం ఆమోదిస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడిన ఇద్దరు మంత్రులకు జైలు శిక్ష విధించారు. ఈ నెల 16న సమర్ఖండ్ నుంచి జీ జిన్పింగ్ రాగానే ఆయన్ను అరెస్ట్ చేశారని సమాచారం.
#Beijing Airport canceled more than 6,000 domestic flights and international flights. Also, all tickets sold by the high-speed rail are suspended, and the rail is completely stopped until further notice. #XiJinping #China #ChinaMilitaryCoup pic.twitter.com/SBgFccyUZd
— The Casulers (@casulers) September 24, 2022
చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ గార్డ్ బ్యూరో (సీజీబీ)పై చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో, స్టాండిగ్ కమిటీ మాజీ సభ్యుడు సాంగ్ పింగ్లకు నియంత్రణ ఉందని సమాచారం. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకు ఈ సీజీబీ రక్షణ కల్పిస్తుంది. మరోవైపు పీఎల్ఏ బలగాలు ఈ నెల 22 నుంచి బీజింగ్ వైపు బయలుదేరాయి. విమాన రాడార్ యాప్లు బీజింగ్ పరిధిలో విమాన సర్వీసుల కార్యకలాపాలు జరుగడం లేదని చెప్పే చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
#PLA military vehicles heading to #Beijing on Sep 22. Starting from Huanlai County near Beijing & ending in Zhangjiakou City, Hebei Province, entire procession as long as 80 KM. Meanwhile, rumor has it that #XiJinping was under arrest after #CCP seniors removed him as head of PLA pic.twitter.com/hODcknQMhE
— Jennifer Zeng 曾錚 (@jenniferatntd) September 23, 2022
చైనా ప్రభుత్వ కొవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ క్వారంటైన్కు వెళ్లడం తప్పనిసరి. ఈ నిబంధనకు అనుగుణంగా జీ జిన్పింగ్ క్వారంటైన్లో ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చైనా సైన్యంపై ఇప్పటికీ జిన్పింగ్కు పట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవినీతి కేసుల్లో గతవారం ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష విధించగా, నలుగురు అధికారులకు యావజ్జీవ జైలుశిక్ష విధించారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు, నలుగురు అధికారులు కూడా జీ జిన్పింగ్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారని సమాచారం. జిన్పింగ్ వ్యతిరేకులపై శిక్ష విధించడంతో ఇప్పటికీ ఆయన శక్తిమంతంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అన్నారు.
జిన్పింగ్ అదృశ్యం కావడం కొత్తేం కాదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. 2012లో చైనా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి. 2017 అక్టోబర్లో తన వ్యతిరేకులు పన్నిన కుట్రను జీ జిన్పింగ్ భగ్నం చేశారని ఆ కథనం సారాంశం. ఈ నెల ప్రారంభం నుంచి వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, అధికారులతో భేటీలకు జిన్పింగ్ గైర్హాజరయ్యారు. గతంలో అమెరికా విదేశాంగ మంత్రిగా పని చేసిన హిల్లరీ క్లింటన్తో భేటీకి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి బయటి ప్రపంచం ముందుకు రాకపోయినా వివరణ ఇచ్చేందుకు చైనా సర్కార్ ముందుకు రావడం లేదు.
2016లో చైనా ప్రధాని లీ కియాంగ్, అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య విమర్శల యుద్ధం తీవ్రమైందని వార్తలొచ్చాయి. గత రెండేండ్లుగా ఇద్దరు నేతల మధ్య సంబంధాలు మరింత దెబ్బ తిన్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం. గత రెండేండ్లుగా పార్లమెంట్ సమావేశాల్లో పక్కపక్కనే కూర్చున్నా షేక్హ్యాండ్లు ఇచ్చుకోలేదని సమాచారం. మీడియా దృష్టిలో పడకుండా ముక్తసరిగా.. పొడిపొడి మాటలతో సంభాషణ ముగించారని ఈ సంస్థ వార్తాకథనం పేర్కొంటున్నది.