ఢాకా : బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని ఢాకాలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకోవడంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ప్రధానకార్యదర్శి, విపక్ష నేత మిర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగిర్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలో అలంగిర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా అలంగిర్ ఇంటిమ నుంచి కొన్ని హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని బీఎన్పీ చీఫ్ ప్రెస్ విభాగం సభ్యుడు శంషుద్దీన్ దిదర్ తెలిపారు.
అలంగిర్ను ప్రశ్నించేందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నామని డిటెక్టివ్ బ్రాంచ్ అదనపు డిప్యూటీ కమిషనర్ హఫీజ్ అల్ అసద్ వెల్లడించారు. అలంగిర్ నిర్భందంతో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యుడు అమిర్, మిర్జా అబ్బాస్ సహా పలువురు బీఎన్పీ నేతల ఇండ్ల వద్ద నిషేదాజ్ఞలు విధించారు. ఢాకాలో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు హింసాత్మకంగా మారిన మరుసటి రోజు పోలీసులు ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.
ఢాకాలో జరిగిన అల్లర్లలో పోలీస్ కానిస్టేబుల్ మరణించడంతో పాటు భద్రతా సిబ్బంది సహా 200 మందికి గాయాలయ్యాయి. తాత్కాలిక ప్రభుత్వ నేతృత్వంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలో బీఎన్పీ ఈ మెగా ర్యాలీని నిర్వమించింది.
Read More :