ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ (Death threat) ఆయన కంపెనీకి చెందిన ఈ-మెయిల్ (email) అడ్రస్కు సందేశం పంపించారు. అయితే ఇప్పుడది రూ.200 కోట్లకు పెరిగింది. వారి బెదిరింపులకు ముకేశ్ అంబానీ స్పందించకపోవడంతో తాజాగా మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. మొదట పంపిన మెయిల్కు ఎలాంటి స్పందన లేకపోవడంతో రూ.200 కోట్లు డిమాండ్ చేశారు.
అడిగినంత ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని ఆగంతకులు బెదిరించారు. తమవద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్స్ ఉన్నారని అందులో పేర్కొన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, అంబానీ సెక్యూరిటీ ఇన్చార్జ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండు బెదిరింపు మెయిల్స్ ఒకే అకౌంట్ నుంచి వచ్చాయని, షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా అంబానికి ఇలాంటి బెదింపులు వచ్చిన విషయం తెలిసిందే.