Kherson city : రష్యా దాడులకు ఉక్రెయిన్లోని ఖేర్సన్ నగరం ఉలిక్కి పడింది. క్రిస్మస్కు ముందురోజు ఖేర్సోవ్ నగరంపై రష్యా సైన్యం జరిపిన దాడిలో దాదాపు ఏడుగురు మరణించారు. 58మంది దాకా గాయపడ్డారు. వీళ్లలో 18 మంది పరిస్థితి విషమంగా ఉందని ఖేర్సన్ ఒబ్లాస్ట్ గవర్నర్ యరోస్లావ్ యనుషెవిచ్ వెల్లడించారు. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. భ’భయంతో, ఆనందం కోసం ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. వాళ్ల చేతిలో ఆయుధాలు లేవు. చెప్పాలంటే యుద్ధ నీతి ప్రకారం ఇది అసలు యుద్ధమే కాదు. మేము ఎంతటి భయంకరమైన వాళ్లతో యుద్ధం చేస్తున్నామో ఈ ప్రపంచం అర్థం చేసుకోవాలి’ అని ఆయన అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశం వచ్చిన ఆయన దాడికి సంబంధించిన ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేశారు. ఆ ఫొటోల్లో తగలబడుతున్న కార్లు, దెబ్బతిన్న భవంతులతో పాటు పుట్పాత్ మీద శవాలు పడి ఉన్నాయి. నవంబర్ నెలలో ఖేర్సన్ నుంచి రష్యా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు పది నెలలు కావొస్తోంది. ఫిబ్రవరి 25న రష్యా సైన్యం దాడికి దిగింది. ఇప్పటివరకూ ఇరువైపులా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు. అయినా కూడా ఇరు దేశాలు తగ్గేదేలే అంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది.
This is not sensitive content – it’s the real life of 🇺🇦.
Kherson. On the eve of Christmas, in the central part of the city. It’s terror, it’s killing for the sake of intimidation and pleasure.
The world must see what absolute evil we are fighting against. #russiaisateroriststate pic.twitter.com/ll1KAjHRom— Володимир Зеленський (@ZelenskyyUa) December 24, 2022