Pakistan | పాకిస్థాన్ (Pakistan)లో ముష్కరులు రెచ్చిపోయారు. పెషావర్ (Peshawar)లోని పాక్ పారామిలిటరీ ప్రధాన కార్యాలయం (Pakistan Paramilitary Force Headquarters)పై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు కమాండోలు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
సోమవారం తెల్లవారుజామున పెషావర్లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఆ కార్యాలయాన్ని ముట్టడించిన ముష్కరులు వరుస దాడులు చేశారు. దీంతో అప్రమత్తమైన పారామిలిటరీ సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు కమాండోలు మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రధాన కార్యాలయంలోపల కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలు, స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి.
Also Read..
Smriti Mandhana | కాబోయే భర్తకూ అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిన పలాశ్ ముచ్చల్
Ozone Pollution | డేంజర్ బెల్స్.. ఓజోన్ కాలుష్యంతో ఊపిరితిత్తులకు ముప్పు..!
ఉద్యోగావకాశాలనిచ్చే డిగ్రీల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీదే హవా..