కీవ్: ఉక్రెయిన్ పోర్ట్ నగరం ఒడిసాపై రష్యా మిస్సైల్ దాడి చేసింది. బిల్డింగ్పై జరిగిన అటాక్లో 18 మంది మృతి చెందారు. దీంట్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నల్లసముద్రంలోని స్నేక్ ఐల్యాండ్ నుంచి తమ బలగాలను ఉపసంహరించినట్లు రష్యా ప్రకటన చేసిన మరుసటి రోజు ఈ ఘటన జరగడం గమనార్హం. సెర్హివికా గ్రామంలో ఉన్న బిల్డింగ్పై తెల్లవారుజామున దాడి జరిగింది. ఒడిసాకు ఇది 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. బహుళ అంతస్తు భవనాన్ని మిస్సైల్ తాకి ఉంటుందని ఉక్రెయిన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడి ఉంటారని అధికారులు చెబుతున్నారు.