China | ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై చైనా సన్నాయి నొక్కులు నొక్కింది. టిబెట్ సౌత్ రీజియన్ (జాంగ్నాన్) తమ భూభాగమేనని చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు. ఈ ప్రాంతాన్ని భారత్ అక్రమంగా స్థాపించిందని, దీన్ని చైనా ఎన్నడూ అంగీకరించలేదన్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. సేలా టన్నెల్ ప్రారంభించారు.
చైనా-భారత్ సరిహద్దుల్లోని తవాంగ్ ప్రాంతాన్ని సైన్యం, ఆయుధ సంపత్తి తరలించడానికి ఉపయోగపడేలా సిద్ధం చేసిన ‘సేలా’ సొరంగాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో చైనా అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.
అరుణాచల్ ప్రదేశ్లో సేలా టన్నెల్ ప్రారంభించినందుకే ఝాంగ్ షియాంగాంగ్ ఈ వ్యాఖ్య చేశారని చైనా రక్షణ శాఖ వెబ్ సైట్ తెలిపింది. ‘జాంగ్నాన్’ తమ అంతర్భాగం అని, అక్కడ భారత్ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేయడమేనని వ్యాఖ్యానించింది.