సెంట్రల్ ఐరోపాలోని నదీగర్భాల్లో అక్కడి పూర్వీకులు ‘హంగర్ స్టోన్స్’ పేరిట కొన్ని రాళ్లను పాతేవారు. ‘నన్ను మీరు చూశారంటే.. మీకు శోకం మొదలైనట్టే’ అని ఆ రాళ్లపై కొన్ని హెచ్చరికలు చెక్కించారు. నదిలో నీళ్లు పూర్తిగా అడుగంటినప్పుడు మాత్రమే ఆ రాళ్లు పైకి కనిపించేవి. అంటే ఆ ప్రాంతంలో కరువు తాండవించినట్టు లెక్క. అయితే కాలక్రమేనా ఈ విషయాన్ని అక్కడి స్థానికులు మరిచిపోయారు.
కారణం గడిచిన 500 ఏండ్లలో ఆ రాళ్లు ఎప్పుడూ కనిపించలేదు. అయితే, తాజాగా ఇప్పుడు అవి బయటపడ్డాయి. ఐరోపా ఖండంలో కరువు తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం చెప్పకనే చెప్తున్నది.
ఐరోపా ఖండం కరువు రక్కసి కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నది. నీటితో ఎప్పుడూ కళకళలాడే నదులు ఎండిపోయి నెర్రలు తేలాయి. దీంతో చుక్కనీరులేక ప్రజలతో పాటు పశువులు అల్లాడిపోతున్నాయి. యూరోపియన్ యూనియన్లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది. ఎండల తీవ్రత పెరిగిపోవడం, వాతావరణ మార్పులే ప్రస్తుత పరిస్థితికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
– లండన్
బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ.
ఆవులు తాగే నీళ్లపై రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధించారు. ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, పూల్స్లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తామని ప్రకటించారు. తాగునీటిని ట్యాంకుల సాయంతో సరఫరా చేస్తున్నారు.
దక్షిణ ఇంగ్లండ్లో థేవ్ నదిలో 356 కిలోమీటర్ల మేర ఇసుక మేటలు వేసింది. ఫ్రాన్స్లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించట్లేదు. టిజ్ నది ఎండిపోవడంతో చనిపోయిన చేపలు ఎండబెట్టినట్టుగా మారాయి. ఇటలీలోనే పొడవైన ది పొ నది సగం ఎండిపోయింది. డాన్యు, రైన్ నదుల ప్రవాహం అడుగంటింది. స్పెయిన్లోని పలు రిజర్వాయర్లు ఎండిపోయాయి.