దుబాయ్ : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మధ్య ఆసియాలో సముద్రంలో ప్రయాణించే నౌకలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎర్ర సముద్రంలో ఆదివారం ఓ అమెరికన్ యుద్ధ నౌకపైనా, కొన్ని వాణిజ్య నౌకలపైనా దాడులు జరిగాయని పెంటగాన్ తెలిపింది.
పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది. అంతకుముందు బ్రిటిష్ మిలిటరీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎర్ర సముద్రంలో అనుమానాస్పద డ్రోన్ దాడి, పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్ లక్ష్యంగా యెమెన్లోని హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.