న్యూఢిల్లీ : దేశీయ మార్కెట్లో ధరల పెరుగుదలతో గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన నిషేధాన్ని అమెరికా వ్యతిరేకించింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ భారత్ చర్య ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గోధుముల ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను పరిశీలించినట్లు ఆమె పేర్కొన్నారు.
ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఆహార ధాన్యాల కొరత మరింత పెరుగుతుందని తాము భావిస్తున్నామని, ఈ క్రమంలో ఎగుమతులను పరిమితం చేయొద్దని ఆయా దేశాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. భారత్తో పాటు ఐక్యరాజ్యసమితి మండలిలో దీనిపై చర్చించనుండగా.. నిషేధంపై భారత్ పునరాలోచన చేయాలన్నారు. ఇటీవల కేంద్రం గోధుమ ఎగుమతులపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. దేశ ఆహార భద్రతను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎగుమతి చేసేందుకు ఇప్పటికే అనుమతించిన దేశాలకు ఎగుమతి కొనసాగుతుందని, క్రెడిట్ లెటర్ జారీ అయిన వాటికి సంబంధించి ఎగుమతికి అనుమతించనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ పేర్కొంది.
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గోధుమల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. భారత్లోనూ రేటు పెరిగింది. ఎగుమతులపై నిషేధం విధించగా.. ధరలు కాస్త తగ్గాయి. ప్రపంచంలో గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 70లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేయగా.. గత ఏప్రిల్ భారత్ రికార్డు స్థాయిలో 14 లక్షల టన్నుల ఎగుమతులను విదేశాలకు సరఫరా చేసింది.