Thailand-Cambodia conflict | థాయ్లాండ్-కంబోడియా (Thailand-Cambodia conflict) సరిహద్దులో మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్లో థాయ్ దళాలపై కంబోడియా దళాలు కాల్పులు జరిపారు. దీంతో థాయ్ సైన్యం వైమానిక దాడులకు (Air strikes) దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఓ థాయ్ సైనికుడు మృతి (Thai soldier) చెందినట్లు థాయ్ సైన్యం వెల్లడించింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇరుపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కంబోడియా సైన్యం తొలుత దాడులను మొదలు పెట్టినట్లు థాయ్ అధికారులు చెబుతుండగా.. ఈ వాదనను కంబోడియా ఖండించింది. థాయ్ దళాలే తొలుత కాల్పులు జరిపినట్లు కంబోడియా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
కాగా, ఈ ఏడాది జులైలో థాయ్లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో సైనికులతోపాటూ పౌరులు కూడా మరణించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ట్రంప్ రంగంలోకి దిగారు. కౌలాలంపుర్లో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చారు. ట్రంప్ సమక్షంలో థాయ్లాండ్-కంబోడియా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే, ఐదు నెలల్లోనే మళ్లీ అక్కడ ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
అక్రమ వలసదారులకు 4.5 లక్షల పెనాల్టీ.. వసూలు చేయనున్న ట్రంప్ సర్కారు
రోడ్డుతో ఈవీలకు వైర్లెస్ చార్జింగ్.. ఎలాగంటే?
పార్కిన్సన్స్కు స్టెమ్సెల్ థెరపీ