లండన్ : ఏఐ కెమెరా సిస్టమ్ను అమర్చిన తొలి మూడురోజుల్లోనే సేఫ్టీ నిబంధనలను గాలికొదిలి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన 297 మంది డ్రైవర్లు కెమెరాల్లో అడ్డంగా బుక్కయ్యారు. 117 మొబైల్ ఫోన్ అఫెన్స్లు, 180 సీటు బెల్ట్ ఉల్లంఘనులను బుక్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసులకు సాయపడింది.
ప్రాధమిక రోడ్డు భద్రతా చట్టం ఉల్లంఘించిన మొత్తం 297 మంది డ్రైవర్లను పట్టుకోవడంలో పోలీసులకు ఏఐ కెమెరాలు సహకరించాయి. నూతన టెక్నాలజీకి మారిన తర్వాత డ్రైవర్ల ఆటలు సాగడం లేదని, కార్లలో ఫోన్ వాడేవారిని ఏఐ కెమెరాలు ఇట్టే పట్టేస్తున్నాయని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాహన డ్రైవర్లను డెవన్ రోడ్ సేఫ్టీ హెడ్ అడ్రియన్ లీక్ హెచ్చరించారు.
హైస్పీడ్ ఏఐ కెమెరాలు, ఇన్ఫా రెడ్ ఫ్లాష్లు, అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్తో కూడిన బ్రిటన్ ప్రవేశపెట్టిన ఏ30 సిస్టమ్తో వాహనాల స్పష్టమైన ఇమేజ్లను క్యాప్చర్ చేస్తాయని చెప్పారు. పోలీసుల కండ్లగప్పేవారిని ఏఐ సమర్ధంగా గుర్తిస్తోందని తెలిపారు. ఈ ఉల్లంఘనల్లో పట్టుబడిన డ్రైవర్లను తీవ్రతను బట్టి వార్నింగ్ లెటర్లు, నోటీసులు పంపడం నుంచి ప్రాసిక్యూట్ చేయడం వరకూ చర్యలు ఉంటాయని చెప్పారు. ఇక భారత్లోనూ ట్రాఫిక్ రూల్స్ను పాటించని వాహనదారులను పట్టుకునేందుకు కెమెరాలను వాడుతున్నారు.
Read More :